గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై వీడనున్న సస్పెన్స్.. నేడే హైకోర్టు తీర్పు

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై సస్పెన్స్‌కి ఈ రోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2024-10-15 04:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై సస్పెన్స్‌కి ఈ రోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, పరీక్ష రద్దు చేయాలని 10కి పైగా అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈ రోజు (మంగళవారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇ‍వ్వనుంది. ఇప్పటికే అనేక పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 21 నుంచి అంటే మరో 6 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు కీలకంగా మారింది. ఈ తీర్పుపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Similar News