సీఎం రేవంత్‌ను కలిసి రూ.50 లక్షల చెక్ అందించిన హీరో మహేష్ దంపతులు

హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు

Update: 2024-09-23 07:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్‌కు మహేష్ దంపతులు ప్రకటించిన రూ.50 లక్షలు చెక్కును వారు సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందించారు. ఎఎంబీ సినిమాస్ తరఫున కూడా మహేష్ మరో రూ.10 లక్షలు విరాళం అందించారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు ప్రకటించి సంబంధిత చెక్కులను స్వయంగా సీఎంను కలిసి అందిస్తున్నారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కులు అందించారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రామ్‌చరణ్‌ తరఫున మరో 50 లక్షల రూపాయల చెక్కుల్ని సీఎం రేవంత్​కు అందించారు.

బాలకృష్ణ, విశ్వక్‌సేన్‌, సాయి ధరమ్‌ తేజ్, అలీ తదితరులు కూడా ఇప్పటికే సీఎంకు తమ విరాళాల చెక్కులను అందించారు.   


Similar News