Birla Ilayya: రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే నీకేం నొప్పి?.. కేటీఆర్ కు ప్రభుత్వ విప్ కౌంటర్

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే నీకేం నొప్పి?.. కేటీఆర్ కు ప్రభుత్వ విప్ కౌంటర్

Update: 2024-10-08 12:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా ఫాంహౌస్ లో ఉంటే నిధులు రావు కదా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కట్టబెడితే ఆ పదవిని నిర్వహించకుండా ప్రభుత్వ జీతం తీసుకుంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మూసీ డీపీఆర్ కోసం ఢిల్లీకి వెళ్లారన్నారు. మీరు అధికారంలో ఉండగా సాధించలేని అనేక పనులను రేవంత్ రెడ్డి సాధించారన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సప్పుడు లేదు కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే కేటీఆర్ కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. తండ్రి చాటున మంత్రి అయిన కేటీఆర్ కు తెలంగాణ ప్రజల సమస్యలు తెలియవన్నారు. కేటీఆర్ కు ఉన్నన్ని దురలవాట్లు మరెవరికి లేవని ఆయనకు ఉన్న అలవాట్లే మిగతా వారికి ఉంటాయనుకుంటే ఎలా అన్నారు. కేటీఆర్ ది పబ్బు, డ్రగ్స్ కల్చర్ అని, దుబాయ్, బొంబాయికి వెళ్లే కల్చర్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే విమర్శలు చేయడం సరికాదన్నారు.


Similar News