గవర్నర్ వరంగల్, యాదాద్రి జిల్లాల పర్యటన

ఈ నెల 27 నుండి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వరంగల్, యాదాద్రి జిల్లాల పర్యటన ఖరారైంది.

Update: 2024-08-22 14:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 27 నుండి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వరంగల్, యాదాద్రి జిల్లాల పర్యటన ఖరారైంది. ఆగస్ట్ 27 నుండి సాగనున్న గవర్నర్ పర్యటనలో.. ముందుగా యాదగిరి నరసింహ స్వామిని దర్శనం చేసుకొనున్నారు. అదేరోజు సాయంత్రం రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటారు. మరుసటి రోజు లక్నవరం చెరువు వద్ద పర్యటించిన అనంతరం, వేయిస్తంభాల గుడిని దర్శించుకుంటారు. కొన్ని అధికారక సమావేశాల అనంతరం మరుసటి రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.  


Similar News