Raja Singh : బోనాల వేడుకల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్

బోనాల పండుగ సందర్భంగా మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2024-07-29 14:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బోనాల పండుగ సందర్భంగా మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా నగరంలో జరిగిన బోనాల జాతర వేడుకల్లో రాజాసింగ్ మాట్లాడుతూ.. బోనాల పండుగ ప్రాముఖ్యతను యువతకు తెలుపాలని సూచించారు. చాలా మంది యువతకు బోనాలు అంటే తాగడం.. ఎగరడం మాత్రమే అనుకుంటారని, కానీ అది పండుగ కాదన్నారు. బోనాల పండుగ మన ధర్మం, సంస్కృతి అని తెలిపారు. మన సంస్కృతిని కాపాడటం మన అందరి బాధ్యత అని చెప్పారు. కానీ కొంత మంది బోనాల పండుగ తాగే పండుగ అని ప్రొజెక్ట్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు మంచిగా ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుతామని వివరించారు.

బోనాల పండుగలో మన హిందువులు మన కుటుంబం బాగుండాలిని మేకలు, గొర్రెలు అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు. కానీ ఆ మేకను బలి ఇచ్చే వాళ్ళు ముస్లింలు ఉంటారని చెప్పారు. హిందువులలో కొంత మంద మేకలను కోసే వారు ఉంటారని, వారిని పిలిపించి కోపించాలని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోపిస్తే.. వాళ్ళు అల్లాహ్ ని సమర్పించేటట్టు ఫాతియా చదివి హలాల్ చేసి కోస్తారని అన్నారు. ఈ సందర్భంగా అది ఎంగిలి అవుతుందని, మనము మన అమ్మవారిని ఎంగిలి బలి ఇవ్వకూడదని, హలాల్‌ని బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News