ప్రయాణికులకు శుభవార్త!.. సికింద్రాబాద్ టు శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు

అక్టోబర్ నెలలో దసరా పండుగ ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

Update: 2024-09-14 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలలో దసరా పండుగ ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ ఫెస్టివల్‌కు బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్లు తమ సొంత గ్రామాలకు వెళ్తారు. దీంతో బస్సులు, రైళ్లు అన్ని కిక్కిరిసిపోతాయి. తగినన్ని సౌకర్యాలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇప్పుడు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 07487 నెంబర్ గల ట్రైన్‌లో 6 ట్రిప్పులు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించగలరని సూచించారు. సికింద్రాబాద్, నల్గొండ, అన్నవరం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు వరకు ఈ రైళ్లు వెళతాయని అధికారులు చెప్పారు.


Similar News