చివరి క్షణంలో కూడా ఐసీయూలో పాట పాడిన గద్దర్..!

ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో అమీర్ పేట్‌లోని అపోల ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు.

Update: 2023-08-06 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో అమీర్ పేట్‌లోని అపోల ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆయన మృతి చెందడానికి ముందు కూడా తన చివరి క్షణంలో ఐసీయూలో ఉన్నప్పటికీ పాటలు పాడినట్లు గద్దర్ కుటుంబ సభ్యులు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. గద్దర్ హఠాత్ మరణంతో యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గద్దర్ పాటలను ఎంతగానో అభిమానించే అభిమానులు ఆయన మృతిపై స్పందిస్తూ.. మీరు మీ పాటల రూపంలో మాతోనే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.


Similar News