అలా కోరుకునే వ్యక్తిని తానే.. మాజీ మంత్రి KTR

రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తిని తానేనని, కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

Update: 2024-07-17 13:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తిని తానేనని, కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కక్షలు, ప్రతీకారానికి కూడా ఓ పరిమితి ఉంటుందని వాటిని దాటి కాంగ్రెస్ కేసీఆర్ పై దుష్ప్రచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసిందన్నారు.

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పు బట్టిందన్నారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమన్నారు. కాంగ్రెస్ చేసే దుష్ర్పచారాలకు దేవుడు కూడా తగిన బుద్ధి చెప్తాడని పేర్కొన్నారు. ఎన్నికుట్రలు, కుంతంత్రాలు చేసినప్పటికీ చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యనించారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరారు. చికిత్స పొందుతున్న సుధీర్ రెడ్డిని బుధవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజల్లోకి రావాలన్నారు.


Similar News