డీఎస్ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

Update: 2024-06-29 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కాగా, మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి డీఎస్ పార్థివ దేహాన్ని బంజారాహిల్స్ లోని నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిజామాబాద్ కు డీఎస్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. నిజామాబాద్‌లో రేపు ఉదయం డీఎస్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.      

Tags:    

Similar News