Food Safety Officers Raids : జూబ్లీహీల్స్లో పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
హైదారాబాద్ జూబ్లీహిల్స్లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదారాబాద్ జూబ్లీహిల్స్లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. ఇటీవల బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయన్న కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదుతో రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ నిర్వహించారు.
కాలం చెల్లిన జ్యూస్, పుట్టగొడుగులు తదితర వాటిని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రీడ్జ్ లో లేబుల్ లేకుండా చికెన్ను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు వెజ్, నాన్ వెజ్ వస్తువులను రిఫ్రిజిరేటర్లో కలిపి నిల్వ ఉంచినట్లు గుర్తంచారు. అనంతరం రెస్టారెంట్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తదుపరి చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.