Feroze Khan: ఎంఐఎం ఇష్యూలో సొంత పార్టీపై ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీపై ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2024-10-10 06:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వర్సెస్ నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఘర్షణ వ్యవహరం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అక్రమాలను బయటపెట్టినందుకే నాపై ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పుల్ స్టాప్ పెట్టాలన్నారు. నాపై దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్టేట్ ఎంట్ ఇవ్వలేదన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు. తాజాగా ఓ చానల్ తో మాట్లాడిన ఆయన ఇక్కడ కమ్యూనల్ వయొలెన్స్ లేదన్నారు. ఇదంతా ఎంఐఎం ఆడుతున్న డ్రామా అన్నారు. తమతో సన్నిహితంగా లేకుంటే మతఘర్షణలు అవుతుందనేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒవైసీ కాలేజీనీ హైడ్రా కూల్చడం నూటికి నూరు శాతం జరుగుతుందన్నారు. కేటీఆర్ గురించి కొండా సురేఖ వాస్తవాలే మాట్లాడారని కానీ ఆ అంశాలను పబ్లిక్ లో చెప్పడం ఆమె స్థాయికి తగదన్నారు. 


Similar News