BREAKING : మాజీ మంత్రి తలసాని ఇంట తీవ్ర విషాదం..

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-06-10 05:04 GMT

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గతంలో బోయిన్ పల్లి మార్కెట్ హోల్ సేల్ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడిగా కూడ తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. శంకర్ యాదవ్ మృతి వార్త తెలుసుకున్న మార్కెట్ వ్యాపారస్తులు ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.


Similar News