Eatala Rajender: కీలక అంశంపై రాజ్ నాథ్ సింగ్ తో ఈటల భేటీ

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

Update: 2024-10-14 12:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కారుణ్య నియామకాల విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కాగా కంటోన్మెంట్ బోర్డులో గత 15 ఏళ్లుగా కారుణ్య నియామకాలు జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ విషయంలో కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా బాధిత కుటుంబాలు అభ్యర్థిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని తాజాగా కోరారు.


Similar News