EAPCET: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

EAPCET-2024‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైంది.

Update: 2024-07-04 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: EAPCET-2024‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ మేరకు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌‌ను విజిట్ చేసి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని EAPCET క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా, ఈ సంవత్సరం నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వాళ్లకు ర్యాంకు ఆధారంగా ఆయన ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని అన్నారు. 


Similar News