DGP Jitender: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించం: డీజీపీ జితేందర్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-13 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుల తీరు పట్ల డీజీపీ జితేందర్ సిరీయస్ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తే ఏమాత్రం సహించబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు.


Similar News