హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ షాకింగ్ రియాక్షన్.. బీఆర్ఎస్ నేతలకు మరోసారి వార్నింగ్

హైకోర్టు తీర్పును కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు.

Update: 2024-09-10 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు తీర్పును కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు. పీఏసీ పదవిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు కాకుండా ఎమ్ఐఎమ్‌కు ఇచ్చారని గుర్తుచేశారు. అసలు పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే తామే సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరుపుతామని తీర్పు వెలువరించింది. కాగా, ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.


Similar News