HYD : గొర్రెల పంపిణీ స్కామ్‌లో ఇద్దరికి కస్టడీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది.

Update: 2024-06-10 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరిని ఏసీబీ నేడు కస్టడీలోకి తీసుకోనుంది. రామచందర్ నాయక్, కల్యాణ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రామచందర్, కల్యాణ్‌ను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఇద్దరిని విచారించనున్నారు. అయితే వీరు విచారణలో వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.  


Similar News