బోరబండలో కాంగ్రెస్ Vs BRS.. లోకల్, నాన్ లోకల్ ఇష్యూతో హై టెన్షన్
జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి బోరబండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోక్, నాన్ లోకల్ ఇష్యూ హై టెన్షన్కు దారి తీసింది.
దిశ, వెబ్డెస్క్: జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి బోరబండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోక్, నాన్ లోకల్ ఇష్యూ హై టెన్షన్కు దారి తీసింది. లోకల్, నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కాసేపు మాటల దాడికి దిగారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసుస్టేషన్కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, బాబా ఫసీయుద్దీన్లు వచ్చి తమ నేతలతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.