CM Revanth: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ సందేశం..

తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు.

Update: 2024-08-18 06:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు. ఈ మేరకు తాజాగా ఒక సందేశం విడుదల చేశారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజలను సంఘటితం చేశారు.

రాజకీయ-సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం అసామాన్యమైనదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి సందేశంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News