కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Update: 2024-07-18 09:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీట ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే కొడంగల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై పలు సూచనలు చేశారు.

ఇక నుంచి కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతీ నాలుగు వారాలకోసారి సీఎం రివ్యూ చేయనున్నారు. కాగా, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రూట్‌మ్యాప్ రూపొందించామని హైదరాబాద్ బుధవారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 

Tags:    

Similar News