Khammam Floods : కష్టాల్లో తోడుగా.. కన్నీళ్లలో అండగా.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-02 13:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘కష్టాల్లో తోడుగా.. కన్నీళ్లలో అండగా.. వరద బాధితులను నేరుగా కలిసి.. ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశాను. ఖమ్మం ఎఫ్‌సీఐ రోడ్డులో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో బాధితులతో ముఖాముఖి మాట్లాడాను. తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేలు అందజేయాలని నిర్ణయించాం. ఆదుకుంటాం.. అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కాలనీలో పర్యటించిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల పక్షపాతి మన రేవంతన్నా అంటూ నెటిజన్లు సీఎంను కొనియాడుతున్నారు.


Similar News