స్పోర్ట్స్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ లోగోను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు.

Update: 2024-08-22 13:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ లోగోను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇండియా యూనివర్సిటీ నెలకొల్పేందుకు సన్నహకాలు జరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ స్పోర్ట్స్ లోగోను సీఎం ఆవిష్కరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ లోగోను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నూతనంగా రూపొందించింది. కాగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రత్యేక కమిటీ ఏర్పడి స్పోర్ట్స్ ముసాయిదాను రూపొందించే పనిలో ఉంది. తెలంగాణ నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్దతో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి పాల్గొన్నారు.  


Similar News