ప్రధాని మోడీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ ముగిసింది.

Update: 2024-07-04 10:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై మోడీతో చర్చించినట్లు తెలిసింది. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్, నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News