యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

మంచిరేవులలో నిర్మించబోయే 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'(Young India Police School) కు నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు.

Update: 2024-10-21 12:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : మంచిరేవులలో నిర్మించబోయే 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'(Young India Police School) కు నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు. తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ సర్కార్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీధర్ బాబు తడితరులు పాల్గొన్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-5వ తరగతులతో ఈ స్కూల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన, అత్యుత్తమ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందించనున్నారు.     


Similar News