CM Revanth Reddy: జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత.. భావోద్వేగంతో సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Update: 2024-09-06 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి (Jitta Bala Krishna Reddy) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో (Yashoda Hospital) చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే జిట్టా మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యరు. ‘మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.


Similar News