MLA Paidi Rakesh: ఒక్క ప్రాంతాభివృద్ధికే సీఎం పరిమితం: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఒక్క ప్రాంత అభివృద్ధికే పరిమితమయ్యారని, అది కూడా తన సొంత సెగ్మెంట్ కే తప్ప ఇతర సెగ్మెంట్లకు నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శలు చేశారు.

Update: 2024-07-24 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఒక్క ప్రాంత అభివృద్ధికే పరిమితమయ్యారని, అది కూడా తన సొంత సెగ్మెంట్ కే తప్ప ఇతర సెగ్మెంట్లకు నిధులు కేటాయించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. తన సెగ్మెంట్ అభివృద్ధికే పరిమితమైన రేవంత్.. మంత్రుల జిల్లాలకు ఎన్ని కోట్లు కేటాయించారు? మిగిలిన జిల్లాలకు ఎన్ని ఇచ్చారనేది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వికసిత భారత్ బడ్జెట్ గా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ కు వచ్చిన బాధ ఏంటని ప్రశ్నించారు. రాజధాని లేకుండా సాటి సోదరులు బాధలో ఉంటే కనీస కనికరం లేదా అని విమర్శలు గుప్పించారు. ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ నచ్చాలని లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో వచ్చేది రామరాజ్యమని ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.

Tags:    

Similar News