BREAKING: మొదలైన కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి

Update: 2024-06-21 10:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు, కటాఫ్ డేట్, విధివిధానాల రూపకల్పన, అర్హులైనవారి గుర్తింపు, పీఎం కిసాన్ యోజన నిబంధనల వర్తింపు, ఆంక్షల విధింపు, రైతు భరోసా విధివిధానాలు, పంటల భీమా, మద్దత ధర పెంపు వంటి రైతు సంక్షేమ అంశాలే అజెండాగా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, అన్ని విభాగాల హెచ్‌వోడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Similar News