KTR : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నర్సంపేట నియోజకవర్గంలోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదుకున్నారు.

Update: 2024-08-29 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: నర్సంపేట నియోజకవర్గంలోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదుకున్నారు. కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానన్న కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ద్వారా బుధవారం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 


Similar News