ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. : BJP నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశం లేదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశం లేదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుని గత ఎన్నికల్లో పరాజయం చూసిందన్నారు. మూడో ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పంపిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తు్న్నారని ప్రశ్నించారు. రుణమాఫీకి కమిటీ అని.. ప్రజాభిప్రాయం అని సీఎం రేవంత్ రెడ్డి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.