Harish Rao : నోటీసులు పంపుతున్నా.. రాజ్యసభ ఎంపీని హెచ్చరించిన హరీష్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

Update: 2024-09-30 06:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో ఆయనకు వాటాలు ఉన్నాయని తాజాగా ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సోమవారం ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు.

‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురదజల్లే వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు. గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను హెచ్చరిస్తున్నా’ అని ఎంపీకి ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.

 


Similar News