BREAKING : మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్..

తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్, గులాబీ బాస్ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-06-25 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్, గులాబీ బాస్ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని.. రిట్ పిటిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ చెప్పారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీల లేఖ రాసి పలు అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ లేఖలో జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని కేసీఆర్ కోరడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.


Similar News