Breaking: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సినీ గేయ రచయిత కన్నుమూత

ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు.

Update: 2024-09-06 06:08 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నిరుపేద చేనేత కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. లలిత గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా విభిన్న కోణాల్లో వడ్డేపల్లి కృష్ణ సాహిత్య సేవలు అందించారు. మానేరు గడ్డ మీద నుంచి అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎదిగిన ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు ఘన నివాళులర్పిస్తున్నారు.


Similar News