సత్తుపల్లి పరిధిలో నెత్తురొడిన రహదారులు.. ఇద్దరు డ్రైవర్లు మృతి

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

Update: 2023-04-17 04:10 GMT

దిశ, సత్తుపల్లి : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సత్తుపల్లి పట్టణ పరిధిలోని సోమవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో వైకుంఠధామ సమీపంలో చోటు చేసుకుంది. AP16TS 7905 నెంబర్ గల లారీ అశ్వరావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా సత్తుపల్లి వైకుంఠధామం వద్ద TS 16TE 5253 నెంబర్ గల లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొట్టాయి. ఈ యాక్సిడెంట్‌లో ఓ లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో డీసీఎం వాహనం చెట్టును ఢీకొనటంతో డ్రైవర్ మృతి

సత్తుపల్లి పట్టణ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున 5.గంటల సమయంలో పెద్ద వంతెన వద్ద అశ్వరావుపేట నుంచి ఖమ్మం వైపు వెళుతున్న డీసీఎం వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. TS 21T 6333 నంబర్ గల డీసీఎం వాహనం అశ్వరావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు జామాయిల్ కర్రల లోడుతో వెళుతుండగా బలంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంతో డ్రైవర్ స్పాట్ లోనే మృతి చెందాడు. ఈ రెండు సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు లారీ డ్రైవర్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News