నిజామాబాద్‌లో బీజేపీ లీడ్.. అర్వింద్ ఆధిక్యం ఎంతంటే..?

నిజామాబాద్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతోంది.

Update: 2024-06-04 04:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతోంది. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి లోని సిఎంసిలో జరుగుతున్న కౌంటింగ్‌లో తొలుత జరిగిన పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్ల లెక్కింపులోను బిజెపి ఆదిక్యత ప్రదర్శించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో బిజెపి స్పష్టమైన మెజార్టీ సాధించింది. బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థ జీవన్ రెడ్డి పై 12497 ఓట్లు ఆదిక్యం తో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో ఒకచోట మాత్రమే బిజెపి కంటే 1255 ఓట్ల అధికంగా సాధించారు. నిజామాబాద్ అర్బన్ లో 1730, బోధన్ లో1323 , ఆర్మూర్ లో 2530, బాల్కొండ 2618, కోరుట్ల లో2981 లీడ్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నారు.


Similar News