గ్రూప్ 1 పరీక్షలపై బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలవి డ్రామాలు : కేటీఆర్

గ్రూప్ 1 పరీక్షలపై కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలు కావాలనే డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు

Update: 2024-10-19 10:51 GMT

దిశ, వెబ్ డెస్క్ :  గ్రూప్ 1 పరీక్షలపై కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిలు కావాలనే డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు  ఆందోళనలు చేస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమని, గ్రూప్ వన్ అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తుందని విమర్శించారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలని, కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలని కోరారు. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఆడుతున్న డ్రామా చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూర్టీ ఇచ్చి మరి బండి సంజయ్ తోరి ర్యాలీ చేయిస్తాడని, మా నాయకులను ఏమో అరెస్ట్ చేయిస్తాడని విమర్శించారు.

బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని, బండి సంజయ్ ఏం చదువుకున్నాడని, ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పరీక్ష పత్రాలు లీక్ చేయమంటే చేస్తాడని, అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో పాల్గొనాలని కోరుతున్నట్లుగా తెలిపారు. 


Similar News