Owaisi : సలకం చెరువులో ఒవైసీ కాలేజీ.. 2012లో వ్యవసాయ భూమి: బీజేపీ ఆసక్తికర ట్వీట్

చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు ‘హైడ్రా’ కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్‌ ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Update: 2024-08-26 13:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు ‘హైడ్రా’ కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్‌ ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో గూగుల్‌ మ్యాప్‌ చిత్రాలతో సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

2012లో వ్యవసాయ భూమి నుంచి 2024 లో ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీ వరకు అని గూగుల్ మ్యాప్ ఫోటోను వివరించింది. ఫాతిమా ఒవైసీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె అని తెలిపింది. ఈ సలకం చెరువులో ఓవైసీ కాలేజీపై రేవంత్ ప్రభుత్వం లేదా హైడ్రా ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేయగలదా? అని ప్రశ్నించింది.

 


Similar News