సీఎం పీఆర్వోలుగా ఇద్దరి నియామకం

సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్వోలు (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు)గా ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Update: 2024-01-11 13:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్వోలు (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు)గా ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పీఆర్వోలుగా బొల్గం శ్రీనివాస్, శ్రీధర్ మామిడాలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు. వివిధ దిన పత్రికల్లో పని చేసిన అనుభవం వారిద్దరికీ ఉంది. ఈ మేరకు వారి ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్వోలుగా నియమించింది.

Tags:    

Similar News