GO 317 : కేబినెట్‌ సబ్‌కమిటీకి కన్సల్టెంట్‌ నియామకం

జీవో 317పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవో 317పై కేబినెట్‌ సబ్‌కమిటీకి కన్సల్టెంట్‌ నియామకం ప్రభుత్వం చేపట్టింది.

Update: 2024-07-20 10:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జీవో 317పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవో 317పై కేబినెట్‌ సబ్‌కమిటీకి కన్సల్టెంట్‌ నియామకం ప్రభుత్వం చేపట్టింది. కన్సల్టెంట్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి బి. వెంకటేశ్వరరావును నియమించారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులకు సంబంధించి స్పౌజ్, మెడికల్, మ్యుచువల్ తదితర బదిలీలకు సంబంధించి 317 జీవో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీవో‌పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి.. ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది.

Read More..

NDSA : ‘కాళేశ్వరం’ భద్రతపై ఎన్‌డీఎస్‌ఏ కీలక భేటీ ప్రారంభం  

Tags:    

Similar News