రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-17 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. రేపు(గురువారం) రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ జమచేస్తామన్నారు. ఈ నెలఖారులోగా రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 7 నెలల్లో సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాభవన్ లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 


Similar News