హైదరాబాద్ విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరు

ఈ నెల 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.

Update: 2024-09-02 16:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నెల 17 జరగనున్న ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ లోణి పరేడ్ గ్రౌండ్స్ మైదానం వేదిక కానుంది. ముఖ్య అతిథిగా హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు, పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ నేతలతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయి, వివిధ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నడూ లేనన్ని సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో బీజేపీ అధిష్టానం జోష్ లో ఉంది. తెలంగాణపై మరింత పట్టు బిగించేందుకు వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ.. కార్యకర్తల్లో నూతనఉత్తేజం నింపనున్నట్టు సమాచారం.  


Similar News