MLA : ప్రతి మండలానికి ఒక బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేస్తాం

ప్రతి మండలానికి ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.

Update: 2024-09-28 09:25 GMT

దిశ, భైంసా : ప్రతి మండలానికి ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. పదోన్నతి, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన పలువురికి స్థానిక ఎస్.ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. విద్యారంగాన్ని అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని, ప్రతి విద్యార్థికీ విలువలతో కూడిన విద్యను ప్రభుత్వ ఉపాధ్యాయులు అందించాలని అన్నారు. అనంతరం ఉత్తమ అవార్డు పొందిన 45 మంది ఉపాధ్యాయులను, పదోన్నతి పొందిన 150 మంది ఉపాధ్యాయులను, కొత్తగా నియామకమైన ముగ్గురు మండల విద్యాధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News