తెలంగాణ టు మహారాష్ట్ర రేషన్ బియ్యం రవాణా.. గుట్టు రట్టు..

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన సుమారు

Update: 2025-02-14 08:48 GMT
తెలంగాణ టు మహారాష్ట్ర రేషన్ బియ్యం రవాణా.. గుట్టు రట్టు..
  • whatsapp icon

దిశ, చెన్నూర్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన సుమారు రూ.30 లక్షల విలువగల 615 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రెండు లారీలు ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 615 క్వింటాళ్ల బియ్యాన్ని హైదరాబాద్ కు చెందిన అధికారులు పక్కా సమాచారంతో చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Similar News