బోథ్లోని ఆలయాలలో చోరీ.. జరిగిన కొన్ని గంటల్లోనే దుండగుల గుర్తింపు
మండల కేంద్రంలోని పెద్దార్ల గుట్ట హనుమాన్ మందిరంలో,అయ్యప్ప

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని పెద్దార్ల గుట్ట హనుమాన్ మందిరంలో,అయ్యప్ప సన్నిధానంలో సోమవారం మధ్యాహ్నం చోరీ జరిగినట్లు స్థానికులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు హనుమాన్ మందిరం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడి హుండీ పలగొట్టినట్లు స్థానికులు తెలిపారు. అంతేగాకుండా అయ్యప్ప సన్నిధానంలో కూడా చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎస్సై ప్రవీణ్ ను అడగగా చోరీ జరిగిన విషయం తెలిసిన కొన్ని గంటలలోనే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.