బోథ్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు మంజూరు

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు

Update: 2024-10-16 10:59 GMT

దిశ,నేరడిగొండ: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఇన్చార్జి ఆడే గజేందర్ తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఈ నిధులతో అభివృద్ధి చేసుకుంటామన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కొరకై కృషి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రభుత్వానికి మరిన్ని ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని అవి కూడా అతి త్వరలోనే మంజూరు అవుతాయని అన్నారు.ఈ నిధుల విడుదలకు సహకరించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గానికి ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.100 కోట్ల నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Similar News