పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

పెంచికలపేట ప్రధాన రహదారి పెద్దవాగుపై సిఆర్ఐఎఫ్ రూ.18 కోట్ల నిధులతో మంజూరైన వంతెన నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ,సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు.

Update: 2024-10-12 09:56 GMT

దిశ,బెజ్జూర్ :పెంచికలపేట ప్రధాన రహదారి పెద్దవాగుపై సిఆర్ఐఎఫ్ రూ.18 కోట్ల నిధులతో మంజూరైన వంతెన నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ,సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడారు.దహెగాం మండలం పెంచికలపేట మండలలా ప్రజలకు అనుసంధానంగా ఉన్న పెద్దవాగు వంతెన అదనపు నిర్మాణం శుభసూచకం అని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలనే ఆక్షించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి యజ్ఞంలో అందరూ భాగస్వాములు అయినప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ ఆర్ అండ్ బి డీఈ ఈ లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్ జగన్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను శాలువాలో పూలమాలతో సత్కరించారు.


Similar News