దేవరకోట దేవస్థానం పాలక మండలి ఖరారు.. నేడే ప్రమాణస్వీకారం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట దేవస్థానం పాలక మండలిని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-10-11 06:58 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట దేవస్థానం పాలక మండలిని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌సి నెంబరు ఎఫ్5/12939/2024 ప్రకారం నూతన పాలకమండలిని నియమించారు. చైర్మన్‌గా కొండా శ్రీనివాస్, పాలకమండలి సభ్యులుగా మోత్కూరి దేవేందర్ గౌడ్, గుల్లే రాజన్న, ఆరే చిరంజీవి, చెట్పల్లి సంతోష్, వొడ్నం నరేందర్, జాదవ్ అనిత, సీనియర్ అర్చకులు ఎస్. నవీన్ కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుకు నూతన పాలక మండలి కృతజ్ఞతలు తెలిపింది. కాగా నూతనంగా నియమితులైన దేవరకోట దేవస్థాన పాలకమండలి ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 4గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే బాధ్యతలను స్వీకరించి విధులు ప్రారంభిస్తారు.


Similar News