నన్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు : ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించే కుట్ర చేస్తున్నారని

Update: 2024-07-03 12:31 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లా మార్చారని అధికారులను నిలదీయడం తప్పేంటి,ఎమ్మెల్యేగా అది నా బాధ్యతఅని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఏం సంబంధం లేదు అని, మహిళా గిరిజన ఎమ్మెల్యే అని చూడకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా నేటికి జిల్లాకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాలేజీ,పాఠశాల,దవాఖానా భవనాలను మంత్రి ప్రారంభించారని ఎద్దేవా చేశారు. నన్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదన్నారు. అధికార బలంతో తమ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.


Similar News