స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితులో కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలను

Update: 2024-07-03 13:59 GMT

దిశ, ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న గ్రామపంచాయతీలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్లు డీజిల్ పోపించుకోలేని పరిస్థితిలో ఉందన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.


Similar News