Mahila Shakthi Canteen : ఈ నెల 22న ఆదిలాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి..

రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాకు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ప్రారంభించనున్నారు.

Update: 2024-07-18 11:13 GMT

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాకు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలసి ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇందులో భాగంగా మొదటగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున ఆ ఏర్పాట్లను పరిశీలిస్తూ డీఆర్డీఓ సాయన్నకు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణను పరిశీలించి ముఖ్యమంత్రి బస, సమావేశ హాల్, లంచ్, తదితర ఏర్పాట్లను టీటీడీసీ, ఆఫీసర్స్ క్లబ్ ను పరిశీలించారు. ఇందులో ఆర్డీవో వినోద్ కుమార్, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News