మత్తడి పేల్చివేత కేసులో మరొకరి అరెస్ట్

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట మత్తడి పేల్చివేత కేసులో మందమర్రి పట్టణానికి చెందిన మేదరి సతీష్ ను అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు.

Update: 2024-10-24 09:28 GMT

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట మత్తడి పేల్చివేత కేసులో మందమర్రి పట్టణానికి చెందిన మేదరి సతీష్ ను అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… మత్తడి పేల్చివేత కేసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మత్తడి పేల్చివేతకు నిందితులకు జిలేటిన్ స్టిక్స్ సప్లై చేసిన సతీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేరొన్నారు. వీరికి సహకరించిన మరో నిందితుడు నితీష్ బిర్లా పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సీఐ రవీందర్ పాల్గొన్నారు.


Similar News